HeadLines

రామ్ కొత్త సినిమా ఎప్పుడంటే..?

'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమా తర్వాత రామ్.. దిల్ రాజు బ్యానర్ లో కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. 'నేను లోకల్' ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషించనుండగా... ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. ప్రస్తుతం వీరితో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది.

ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందనుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓ నెలరోజులు వాయిదా పడిందట. పూర్తి స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కారణం ఏదైనప్పటికీ.. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారట. పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.