HeadLines

ఫస్ట్ లుక్ టాక్: 'పంతం' పట్టిన గోపీచంద్

గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న కొత్త సినిమా 'పంతం'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాతో కె.చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈరోజు ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ గోపీచంద్ అభిమానులకు ఆకర్షించేలా డిజైన్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ ఎన్నారైగా నటిస్తున్నాడనే టాక్ ఉండగా.. ఫస్ట్ లుక్ లో ఓ వైపు ఆవేశం, మరోవైపు ఆవేదనతో కూడిన సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా డెబ్బై శాతం వరకూ చిత్రీకరణ పూర్తవగా.. మే-18న విడుదల చేయాలని భావిస్తున్నారు. గోపీచంద్ కెరీర్ లో ఇది 25వ సినిమా కావడం విశేషం.