HeadLines

సెన్సార్ పూర్తి చేసుకున్న 'స్పైడర్'

మహేశ్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' చిత్రం... ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే.. నిన్నమొన్నటి వరకూ ఇంకా ప్యాచ్ వర్క్ కంప్లీట్ కాకపోవడం అభిమానులకు కాస్త షాక్ ఇచ్చింది. అయితే.. ఈలోపే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు.

'స్పైడర్' చిత్రం నిడివి 2 గంటల 25 నిముషాలు అని తెలుస్తోంది. తమిళ నటులు, ఎస్.జె.సూర్య, భరత్ నెగటివ్ రోల్స్ లో నటించగా.. మహేశ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. మహేశ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా.. హిందీ, మలయాళ, అరబిక్ భాషల్లోనూ విడుదల కానుంది.