HeadLines

ఆది 'నెక్స్ట్ నువ్వే' ట్రైలర్ టాక్



ఆది కథానాయకుడిగా బుల్లి తెర నటుడు ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నెక్స్ట్ నువ్వే'. ఆది సరసన వైభవి శాండిల్య నటిస్తోన్న ఈ సినిమాలో రష్మీ గౌతమ్ మరో కథానాయికగా నటిస్తోంది. గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ మూవీని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

హారర్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా.. తమిళ హిట్ మూవీ ‘యామిరుక్క భయమే’కు రీమేక్. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను నవంబర్-3న విడుదల చేయబోతున్నారు. నలుగురు ‌సభ్యుల తొట్టిగ్యాంగ్ హోటల్ పెడితే ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇక ట్రైలర్ లో రష్మి స్పెసీ యాక్టింగ్ తో పాటు బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ హైలెట్ గా నిలచింది. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు అందుకుంటోన్న ఆదికి.. ఈ హారర్ కామెడీ రీమేక్ అయినా హిట్ ఇస్తుందేమో చూడాలి!