HeadLines

నితిన్ కు ఊరట.. కేసు కొట్టేశారు


టాలీవుడ్‌ హీరో నితిన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రెండేళ్ల క్రితం రిలీజైన 'అఖిల్' సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో నితిన్ మరియు అతని సోదరి నిఖితారెడ్డ్డిలపై కోర్టులో కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రైట్స్ తనకు ఇస్తామంటూ శ్రేష్ట్ మూవీస్ అడ్వాన్స్ గా రూ.50 లక్షలు తీసుకుని.. ఆ తర్వాత ఇవ్వకుండా మోసం చేశారని సికింద్రాబాద్‌కు చెందిన జి సత్యనారాయణ మల్కాజిగిరి కోర్టులో ఫిర్యాదు చేశారు.

ఇందులో శ్రేష్ట్ మూవీస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నితిన్, నిఖితలను నిందితులుగా చేర్చారు. ఇది చెక్కులకు సంబంధించిన వ్యవహారం. కానీ క్రిమినల్ కేసు పెట్టటం సరికాదంటూ కొట్టివేసింది. అదీకాక.. శ్రేష్ట మూవీస్ సంస్థలో నితిన్, నిఖితా రెడ్డి పార్టనర్లు అంటూ తప్పుగా పేర్కొని ఫిర్యాదు చేశారని కనుక ఈ కేసు చెల్లదని కూడా కోర్టు వెల్లడించింది.