HeadLines

చరణ్ 'రంగస్థలం'కు పోటీగా నందమూరి హీరో

రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న 'రంగస్థలం' సినిమా.. మార్చి 30న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సినిమాకి ఒక రోజు ముందుగా సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతోన్న 'మహానటి' సినిమాను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా ఇదే సమయానికి కళ్యాణ్ రామ్ సినిమా కూడా థియేటర్స్ కు రాబోతోంది.

కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందుతోన్న 'ఎమ్మెల్యే' సినిమాను మార్చి-28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సినిమా వస్తోందని తెలిసి కూడా.. అదే సమయానికి 'మహానటి', 'ఎమ్మెల్యే' సినిమాలు వస్తుండడం సినీజనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. చరణ్ సినిమా ఆలస్యం అవుతుందనే నమ్మకంతో వస్తున్నారా.. లేక పోటీని తట్టుకునే సామర్థ్యంతో వస్తున్నారో తేలియాల్సి ఉంది.