HeadLines

పాండిచ్చేరి బీచ్ లో నాగార్జున



నాగార్జున ప్రధాన పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాజుగారి గది 2'. సమంత కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  పాండిచ్చేరిలో జరుగుతోంది. కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తవగా ఇదో మూడో షెడ్యూల్. పాండిచ్చేరిలోనే మరో ఇరవై రోజుల పాటు ఈ షూటింగ్ జరుగుతుందని దర్శకుడు ఓంకార్ తెలిపారు.