HeadLines

పూరి హీరోయిన్ కు తెలుగులో మరో ఛాన్స్



కొత్త హీరోయిన్స్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో అందె వేసిన చేయి పూరి జగన్నాథ్. ఇప్పటికే ఎంతోమందిని హీరోయిన్స్ ను పరిచయం చేసిన పూరి... ఆమధ్య 'ఇజం' సినిమాతో అదితి ఆర్యను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే.. ఈ సినిమా పరాజయం పాలవడంతో.. ఇక తెలుగులో అదితికి అవకాశాలు రావడమే కష్టమేననుకున్నారు. కానీ అనూహ్యంగా సెకండ్ ఛాన్స్ కూడా తెలుగులోనే అందుకుంది అదితి ఆర్య.

'జీనియస్' ఫేం హవీష్ హీరోగా 'నన్ను వదిలి నీవు పోలేవులే' పేరుతో ఓ సినిమా ప్రారంభం కాబోతోంది. సాయి శ్రీరామ్ డైరెక్టర్ గా పరిచయం అవుతోన్న ఈ సినిమాను రమేష్ వర్మ నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో హవీష్ కు జంటగా అదితి ఆర్యను సెలక్ట్ చేశారు. మరో నలుగురు హీరోయిన్స్ నటించనున్న ఈ మూవీలో అదితిదే మెయిన్ లీడ్ అని తెలుస్తోంది. మొత్తానికి.. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్న చందాన.. తెలుగులోనూ అదితి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.