HeadLines

వెంకీ, వరుణ్ సరసన హీరోయిన్స్ ఫిక్స్


వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ రూపొందబోతున్న విషయం తెలిసిందే. "ఎఫ్‌-2' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటించనున్నారని గతకొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. తాజాగా.. ఈ ఇద్దరు హీరోయిన్స్ నే ఫైనల్ చేసినట్టు దర్శకుడు అనిల్ ట్విట్టర్ ద్వారా దృవీకరించాడు. జూన్ ఫస్ట్ వీక్ లో ప్రారంభం కానున్న ఈ సినిమా.. అదే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతోంది.